RSS

మావూరి తిరునాళ్ళ


శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు మా వూరి చెన్నకేశవుని కళ్యాణం,తరువాత రధోత్సవం
మా
చిన్నప్పుడు రోజుకి స్కూల్ ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలందరం ఇంట్లో వుండే వాళ్ళం.
మేము 5 గురం ఆడపిల్లలం ఒక్క అన్నయ్య.అన్నయ్య మా అందరికంటే పెద్దవాడు.

మేము రధం చూడాలంటే అమ్మ నా కన్నా చిన్న వాళ్ళయిన చెల్లెళ్ళ బాధ్యతను మా పెద్దక్కకి అప్పగించేది.
అమ్మ,నేను,మా రెండో అక్క ఒక జట్టు.మా రెండో అక్కను అందరు అమ్మ కూచి అనేవాళ్ళు.
మా అన్నయ్య ,నాన్న రధం లాగటానికి వెళ్ళేవాడు.మమ్మల్ని మా అమ్మ లక్ష్మీదేవి మిద్దెలు అనే డాబాలు ఎక్కించి రధం చూపించేది.
రధం రోజున ఇసుకవేస్తే రాలనంత జనంవచ్చేవాళ్ళు ,వీధులన్నీ మిటాయి అంగళ్లు ,బొమ్మల కొట్లతో నిండి ఉండేవి.
రధం రోజున చుట్టుపక్కల ఊర్ల నుండి మా చుట్టాలు,వాళ్ళ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు..చాలా సందడిగా ఉండేవి తిరునాళ్ళ రోజులన్నీ..
పండగ మాట ఎలా వున్నా ఇంటికి వచ్చే చుట్టాలకి వండి పెట్టటం,మర్యాదలు చేయటం అంతా మా అమ్మ చాలా ఓపికగా చేసేది.రకరకాల పిండివంటలు వండేది.

రధం అయిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ గుడికి తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేయించి వచ్చేటప్పుడు ఎవరికి
ఇష్టమైన బొమ్మలు వాళ్లకి కొనిపించి తీసుకు వచ్చేవారు మా నాన్న.

తిరునాళ్ళ టైం లో ఒక రోజు చింతామణి నాటకం,ఒకరోజు మయసభ,ఒక రోజు హరికధ కాలక్షేపం జరిగేవి.
ఇవన్నీ చూడటానికి మా అమ్మ పక్కింటి పెద్దవాళ్ళతో వెళ్లి వచ్చేది.

ఇలా ప్రతిసంవత్సరం వచ్చే తిరునాళ్ళ మాకు చాలా సందడిగా,సంతోషంగా గడిచిపోయేది..మళ్ళీ వచ్చే తిరునాళ్ళ కోసం ఎదురు చూస్తూ వుండేవాళ్ళము..


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 వ్యాఖ్యలు:

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...