RSS
Showing posts with label కధలు - కబుర్లు. Show all posts
Showing posts with label కధలు - కబుర్లు. Show all posts

అత్తామామలు వద్దంట...!


రోజు మధ్యాహ్నం నేను టీవీ పెట్టే సరికి "వనితా చానెల్"లో రచయిత్రి శైలజా అనే ఆవిడ, ఇంకొక వ్యక్తి అతని వివరాలు నాకు తెలియలేదు.వీళ్ళిద్దరితో "అత్తామామలు వద్దంట" అనే విషయం గురించి లైవ్ షో లో యాంకర్ మాట్లాడుతుంది.
వాళ్ళ చర్చలో ముఖ్యమైన విషయం ఏంటంటే "పెళ్లి ఐన తర్వాత కొడుకుని కానీ కూతుర్ని కానీ తల్లిదండ్రులు ఏమీ ఆశించకూడదు.వాళ్ళని వాళ్ళ స్వేచ్చకు వదిలేసి వెళ్లి వృద్దాస్రమాల్లో వుండాలి.కని పెంచాము కాబట్టి ముసలితనంలో మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని పిల్లల్ని విసిగించకూడదు" ...అని ఇద్దరు వక్తలు మాట్లాడారు.

వీళ్ళిద్దరినీ యాంకర్ ఒక ప్రశ్న అడిగారు ఏమని అంటే ...
మరి తల్లి దండ్రులు పిల్లల్ని కష్టపడి,ఆస్తులు అమ్ముకునైనా చదివిస్తారు,పెళ్ళిళ్ళు చేస్తారు కదా ?
చివరి రోజుల్లో వాళ్ళని పిల్లలు కాకపొతే ఎవరు చూసుకుంటారు అని.
అప్పుడు ప్రోగ్రాం లో మాట్లాడుతున్న వక్తల సమాధానం "వాళ్లకి ఎంతో కొంత ఇచ్చి వృద్దాశ్రామాల్లో
పెట్టాలి అంతే కానీ పిల్లలతో ఉంటాము అనకూడదు."

ఫారెన్ లో పిల్లల్ని ఎడ్యుకేషన్ లోన్ తో చదివిస్తారు ఇక్కడ కూడా అలాగే చేయాలి
అప్పుడు అప్పు పిల్లలే తీర్చుకుంటారు అని మాట్లాడారు.
సరే అలా చూసుకున్నా ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించాలంటే తల్లి కానీ తండ్రి కానీ చేయాల్సిన పనే కదా..
వాళ్ళ హామీ లేనిది పిల్లలకి లోన్ ఇస్తారా?? విధంగా నైనా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కదా?

జీవిత కాలం కలిసి ఉంటానని,కష్ట సుఖాల్లో బాధ్యత తీసుకుంటానని పెళ్లి నాడు ప్రమాణం చేసాడు
కాబట్టి నా భర్త నా సొంతం అని ఆడపిల్ల అనుకున్నట్లే,నవమాసాలు మోసి కని,కష్టపడి పెంచాను
కాబట్టి నా కొడుకు నా కష్ట సమయంలో నాకు తోడుండాలి,అతని ఆనందంలో నేను పాలుపంచుకోవాలి
అని తల్లిదండ్రులు కోరుకోకూడదా ??
పెళ్లి అయ్యి ఇంట్లో అడుగుపెట్టగానే ఇల్లంతా నాది,మీరంతా థర్డ్ పర్సన్స్ అని అత్తల్ని,ఆడపడుచులని
అవమానించటం కోడలికి భావ్యమా??

కార్యక్రమంలో రచయిత్రి శైలజ గారు ఎంతప్పటికీ అమెరికాలో సెటిల్ అయిన,ఉన్నత కుటుంబాలకు చెందిన వ్యక్తుల గురించే మాట్లాడారు.. కానీ మిడిల్ క్లాస్ వ్యక్తుల గురించి కూడా ఆలోచించాలి.
పిల్లల మీద ఆధార పడకుండా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళున్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లల అండ లేకపోయినాబ్రతకగలరు.. కానీ పిల్లల కోసం,వాళ్లకి మంచి జీవితాన్ని ఇవ్వటం కోసం సమస్తాన్నిధారపోసి వాళ్ళకంటూ ఏమీ లేకుండా,చివరికి పిల్లలే ఆధారం గా వుంటారులే అని వాళ్ళనే నమ్ముకున్న తల్లిదండ్రులు ఏమి కావాలి??

నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అని గొప్పలు చెప్పుకుంటూనే తల్లిదండ్రులు పిల్లలు
మమ్మల్ని
పట్టించుకోవటం లేదు అని తల్లిదండ్రులు మనసులో తిట్టుకుంటారు అలా తిట్టుకోకూడదు
అని
రచయిత్రి శైలజ అన్నారు..

మరి నిజమే కదా కొడుకు ఎంత గొప్ప స్తాయిలో వున్నా, తల్లి మనసుకు సంతోషాన్ని కలిగించాలన్న
విషయం కొడుకులు,కూతుర్లు మర్చిపోకూడదు.అలాగే తల్లి ఒకవేళ ఎప్పుడైనా కోపంతో ఒక్క మాట
పిల్లల్ని అన్నా మరుక్షణమే తన బిడ్డల్ని అలా అన్నందుకు తనే ఎంతో బాధపడుతుంది..

ముసలితనంలో తల్లిదండ్రులు కోరుకునేది ఆస్తిపాస్తులు,అధికారాలు కాదు..
కేవలం పిల్లలు పెట్టే తిండి కోసం వాళ్ళు బ్రతకరు.
పిల్లల నుండి పెద్దలు ఆశించేది ప్రేమతో కూడిన ఒక పలకరింపు, వయసులో వాళ్ళ మాటకు విలువ ఇచ్చి
వాళ్ళని గౌరవిస్తున్నామన్న ఒక ఆప్యాయతను తల్లిదండ్రులు కోరుకుంటారు.

ఉద్యోగాలు వచ్చి వేరే ప్రదేశాలకి వెళ్ళే పిల్లలు తల్లిదండ్రులను వెంట తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు.
వాళ్లకి అనుకూలంగా ఉన్న చోటనే వాళ్ళ జీవనోపాధికి మార్గాన్ని ఏర్పాటు చేయొచ్చు, వాళ్లకు వీలైనప్పుడు
వచ్చి తల్లిదండ్రులను చూడొచ్చు కదా??

పిల్లల్ని
కని, పెంచటం ,చదివించటం తల్లి దండ్రుల బాధ్యత అన్నారు నిజమే..
మరి వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కాపాడాల్సిన బాధ్యత
పిల్లలకి లేదా??

వృ
ద్దాశ్రామాల్లో వుండే వాళ్ళంతా తప్పని సరి పరిస్థితుల్లో,గత్యంతరం లేక అక్కడ వుంటారు కానీ
పిల్లలు మాకొద్దు అని వదిలేసి,మాకు ఒంటరితనం కావాలి అని తల్లిదండ్రులు కోరుకోరని నా అభిప్రాయం.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నీ కంటిచూపు నాకు ఉషోదయం..


సూరీడు కిరణాలు భూమిని వీక్షిస్తుంటే వసుధ తన పచ్చని పరువాన్ని దాచుకుంటుంది.
చల్లని గాలిలో తేలియాడుతూ కమ్మని గీతం నా చెవిన పడింది.
కనులు కనులతో కలపడితే కలలకు పేరేమి?
నా సూరీడు కిరణాల కోసం నా కనులు వెతికాయి. భగవద్యానం చేసుకుని ఆఫీసు కు సిద్దమవుతున్నారు.
ఏమండి !మీ భోజనం సిద్దం లంచ్ బాక్స్ ఇస్తూ అన్నాను.
నవ్వుతు చూస్తారని ఆశపడ్డాను గీతంలోని కలలు కోరుకుంటూ .
వినినట్టు లేరు .హడావిడిగా ఆఫీసు ని తలచుకుంటూ బండి మీద దూసుకుపోయారు..
నా కనులు చెమ్మగిల్లాయి..
సాయంత్రం తప్పక చూస్తారులే అని చెప్పా నా కళ్ళకి.వేచి ఉన్న సాయంత్రం రానే వచ్చింది.
సూరీడు రాత్రికి రమ్మని భూమికి కబురిచ్చి వెళ్ళాడు.తన వేడి వాడి చూపులతో తనువంతా తరచి మరీ.
నా సూరీడు అలసి సొలసి చేరారు ఇంటికి.తనువు అలసింది కాని మనసు కాదు కదా!
నా ఎదురు చూపులు కాస్త కలబడాలని సిద్ధమయినాయి.
కాని T.V ..ముందు కుర్చుని తన కళ్ళని
T.V..కి సమర్పించినట్టున్నారు..
భోజనం కుడా
T.V చూస్తూనే ముగించారు.
ప్చ్!రాత్రికి దొరుకుతారులే !నా కళ్ళు మెరిసాయి. అప్పుడు కూడా నిరాశే ఎదురైనది.
లైట్లు ఆర్పి వచ్చి నా మీదకి దూకారు.
ఆయన కళ్ళ కోసం వెదికాయి నా కళ్ళు
కలల కోసం,కలబాడటం కోసం
... చిమ్మ చీకట్లో ఆయన స్పర్స దొరికిందే కాని ఆయన కనులు దొరకలేదు.
నా కళ్ళు కన్నీరయ్యాయి..
నీ కంటి చూపు చాలునయ్యా శ్రీవారు!
ఆభాగ్యం ఇచ్చి భాగ్యవతి ని చేయవయ్య
భర్తగారు!
నా కనులు కుడా చెదిరిన కలతతో మూతపడ్డాయి మరో ఉషోదయం కోసం!
మంచి శుభారంభం కోసం !
నా సూరీడి కిరణాల కోసం !

చిన్ని కవితలో భర్త కంటిచూపు కోసం తపన పడే ఇల్లాలి ఆవేదన కనిపిస్తుంది
ఇలాంటి భార్యలు లోకంలో ఎంతమందో.
నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో ఉదయాన్నే లేచిన దగ్గరనుండి
బిజీ బిజీగా వుంటూ ఆఫీసుకెళ్ళి తిరిగి ట్రాఫిక్ పద్మవ్యూహాలని దాటుకొని ఇంటికొచ్చేసరికి
సర్వ శక్తులు ఉడిగి..రాత్రికి ఇంటికి వచ్చాక కూడా కనీసం మాట్లాడుకునే ఓపిక లేకపోయినా...
కాస్త టైం కూడా టీవీలకి,కంప్యూటర్లకి అప్పగించి నిద్ర పోయే వాళ్ళు ఎంతమందో.
ఇంక ఎక్కడ
కనులు కనులతో కలబడితే కలలకు పేరేమి???

కవిత "జి.వసంత - రాజమండ్రి" గారిచే రచించ బడినది.నాకు చాల నచ్చిన కవిత ఇది .
రచయిత్రి గారికి థాంక్స్....


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

పేగుబంధం


నీవు మొదటి సారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది,
నన్ను
అమ్మను చేస్తున్నావని

నీవు
వూపిరాడనీయకుండా కదులుతూ హడావుడి చేస్తుంటే ,
ఉత్సాహం
కనిపించింది..హుషారైన వాడివని

నన్ను
చీల్చుకుని లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది
నా
ప్రతిరూపానివని

నా
రక్తాన్ని పాలుగా తాగుతుంటే,బోలెడంత ఆశ కలిగింది
అందరికంటే
బలవంతుడివి కావాలని

తప్పటడుగులు
వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే,
తట్టుకోలేనంత
ఆనందం కలిగింది..
నీ
కాళ్ళ మీద నీవు నిలబడగలవని..

అడుగుల్తోనే నాకు దూరమైతే ఆశీర్వదించాలనిపించింది
గొప్పవాడివి
కావాలని

జీవన
ఒత్తిడిలో పడి నన్ను మరిచిపోతే,కొండంత ధైర్యం వచ్చింది
నేను
లేకపోయినా బ్రతకగలవని

ప్రాణం
పోయేటప్పుడు కంట తడి పెట్టనందుకు తృప్తిగా ఉంది
నీకు
తట్టుకునే శక్తి వుందని

ఇప్పుడే
బాధగా వుంది.అందరు నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే
నన్ను
కాల్చేటప్పుడు నీ చేయి కాలుతుందేమోనని


సాక్షి ఫండే లో లవ్ అనే శీర్షికలో ప్రచురితమైన,
"జి.ఆనంద్" గారు రాసిన
కవిత నాకు చాలా నచ్చింది.
తల్లిప్రేమ గురించి రచయిత చాలా చక్కగా వర్ణించారు..


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నాకు నచ్చిన కధ...నాన్న ఎప్పుడొస్తారు?


రోజు ఆదివారం అవటాన కొంచెం లేట్ గానే లేచాము..
టిఫిన్
,కాఫీ పూర్తి చేసి పేపర్ తిరగేయటం మొదలు పెట్టాను.
సాక్షి
ఆదివారం ఫన్ డే బుక్ లో ఒక స్టొరీ నా గుండెను కదిలించివేసినది.
ఇది
పిల్లల తండ్రి చాట్ బందర్ దగ్గిర బాంబు బ్లాస్ట్ లో చనిపొతే ఆభార్య
దుఖాన్ని భరిస్తూ విషయాన్నీ తన పిల్లలకు ఎలా చెప్పాలో అర్ధమవక
తల్లి పడే బాధను కళ్ళకు కటినట్టుగా చాల బాగా రాశారు.
కధ చదివి చాల సేపటివరకు నాకు బాధ వేసినది .
చివరిలో
ఒక వాక్యం హృదయాన్ని చాల బాదకు గురిచేసినది.
"బయట
నల్లగా చీకటి ....పొరలు పొరలు గా దుఖం లాగా నగరం లోని మల్టీ స్టోరీడ్ అపార్ట్ మెంట్లో
మినుకుమనే
దీపాలు ..ఎవరి జీవితాలూ వారివి అంతే...ఇంకేమి లేదు. "

నిజంగా
గోకుల్ చాట్ బాంబు బ్లాస్ట్ సంఘటనలో ఎందఱో తల్లిపిల్లలు అన్నదమ్ములు ,అక్కాచెల్లెలు ,
భర్తలు
పోయిన వాళ్ళు భార్యలు పోయిన వాళ్ళు,అవయవాలు పోయినవాళ్ళు .
వీళ్ళందరూ
అన్యాయం చేసారని ఇవన్ని అనుభవించాలి.
ఇలాంటి
సంఘటనలు జరిగిన తర్వాత కొన్ని రోజులు సంతాపసభలు పెట్టడం ,
తరువాత
అంతా మాములుగానే కాలచక్రం తిరిగిపోతుంది .
ఎవరో
ఒకరు ఎపుడో అపుడు ....అన్నటుగా గుండెని తట్టే ఇలాటి కధలు
చదివి
నపుడు ఒక్క క్షణం కలుక్కుమంటుంది.
ఇంత
మంచి కధను రాసిన ఆకునూరి హసన్ గారికి థాంక్స్.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...