RSS

నాకు నచ్చిన కధ...నాన్న ఎప్పుడొస్తారు?


రోజు ఆదివారం అవటాన కొంచెం లేట్ గానే లేచాము..
టిఫిన్
,కాఫీ పూర్తి చేసి పేపర్ తిరగేయటం మొదలు పెట్టాను.
సాక్షి
ఆదివారం ఫన్ డే బుక్ లో ఒక స్టొరీ నా గుండెను కదిలించివేసినది.
ఇది
పిల్లల తండ్రి చాట్ బందర్ దగ్గిర బాంబు బ్లాస్ట్ లో చనిపొతే ఆభార్య
దుఖాన్ని భరిస్తూ విషయాన్నీ తన పిల్లలకు ఎలా చెప్పాలో అర్ధమవక
తల్లి పడే బాధను కళ్ళకు కటినట్టుగా చాల బాగా రాశారు.
కధ చదివి చాల సేపటివరకు నాకు బాధ వేసినది .
చివరిలో
ఒక వాక్యం హృదయాన్ని చాల బాదకు గురిచేసినది.
"బయట
నల్లగా చీకటి ....పొరలు పొరలు గా దుఖం లాగా నగరం లోని మల్టీ స్టోరీడ్ అపార్ట్ మెంట్లో
మినుకుమనే
దీపాలు ..ఎవరి జీవితాలూ వారివి అంతే...ఇంకేమి లేదు. "

నిజంగా
గోకుల్ చాట్ బాంబు బ్లాస్ట్ సంఘటనలో ఎందఱో తల్లిపిల్లలు అన్నదమ్ములు ,అక్కాచెల్లెలు ,
భర్తలు
పోయిన వాళ్ళు భార్యలు పోయిన వాళ్ళు,అవయవాలు పోయినవాళ్ళు .
వీళ్ళందరూ
అన్యాయం చేసారని ఇవన్ని అనుభవించాలి.
ఇలాంటి
సంఘటనలు జరిగిన తర్వాత కొన్ని రోజులు సంతాపసభలు పెట్టడం ,
తరువాత
అంతా మాములుగానే కాలచక్రం తిరిగిపోతుంది .
ఎవరో
ఒకరు ఎపుడో అపుడు ....అన్నటుగా గుండెని తట్టే ఇలాటి కధలు
చదివి
నపుడు ఒక్క క్షణం కలుక్కుమంటుంది.
ఇంత
మంచి కధను రాసిన ఆకునూరి హసన్ గారికి థాంక్స్.


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 వ్యాఖ్యలు:

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...